Jagadish Reddy: ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వాటా నుండి చుక్క నీరు కూడా పోనివ్వం

Jagadish Reddy: నీటి వివాదంపై మంత్రి జగదీష్ రెడ్డి రియాక్షన్

Jyothi
Published on: 30 Nov 2023 11:52 AM IST
Minister Jagadish Reddy Reacts to the Nagarjuna Sagar Project Controversy
X

Jagadish Reddy: ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వాటా నుండి చుక్క నీరు కూడా పోనివ్వం

Jagadish Reddy: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివాదంపై మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. సాగర్ నీటి విషయంలో మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ మొండిగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు , జగన్ ప్రభుత్వాల నుంచి కృష్ణా నీటి సమస్య కొనసాగుతుంది అన్నారు మంత్రి . కృష్ణానది నీటి పంపకాలపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుంది అన్నారు జగదీష్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరితో తోండి చేస్తుంది అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్ర వాటా నుండి చుక్క నీరు కూడా పోనియం అని తెగేసి చెప్పారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో చేలాగాటమాడే పద్దతిలో ఆంధ్ర వ్యవహారిస్తోంది అన్నారు మంత్రి. కేసీఆర్ ఉన్నంత కాలం మా హక్కుల్ని హరించడం ఎవరివల్ల కాదన్నారు. నీటి వివాదం అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు మాకు లేదన్నారు.

Jyothi

Jyothi

Next Story