హైదరాబాద్ మిధానిలో 158 ఉద్యోగాలు

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు...
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్-MIDHANI సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మిధానిలో మొత్తం 158 ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి ఏడాది కాలవ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టుల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది మిధాని. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 16 చివరి తేదీ.
ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలని తెలిపారు. వివరాల కోసం మిధాని అధికారిక వెబ్సైట్ https://midhani-india.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్లో చూడొచ్చు. మిగిలిన అన్ని అర్హతలను అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధులు అప్లికేషన్ ఫామ్ ను పైన తెలిపిన సైట్ నుంచి ప్రింట్ తీసి నోటిఫికేషన్లో తెలిపిన అడ్రస్కు చివరి తేదీ లోగా అంటే అక్టోబర్ 16 లోగా పంపించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు...
మొత్తం ఖాళీలు- 158
ఎలక్ట్రీషియన్- 48మెషినిస్ట్- 20
ఫిట్టర్- 50
వెల్డర్- 20
టర్నర్- 20
ముఖ్యమైన తేదీలు
అక్టోబర్ 16 -2020 దరఖాస్తులకు చివరి తేదీ
ఎంపిక విధానం
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, మెరిట్ లిస్ట్
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
Deputy Manager (TIS & Apprenticeship Training),
Mishra Dhatu Nigam Limited,
Kanchanbagh, Hyderabad – 500058.