పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

Petrol Rates: పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 30 March 2023 7:30 PM IST
KTR Writes Letter To PM Modi On Petrol Rates
X

పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

Petrol Rates: పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచేసి.. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని మండిపడ్డారు. ముడిచమురు ధరలు తగ్గినా.. దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గడం లేదని అన్నారు. పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని.. మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మరోసారి రుజువైందన్నారు. మోడీ తన కార్పొరేట్‌ మిత్రుల ఖజనాను లాభాలతో నింపేందుకే ధరల పెంపు అంటూ ఆరోపించారు. ధరల భారంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని లేఖలో తెలిపారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story