KTR: పాగాల సంపత్‌రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్‌

KTR: జనగామ జిల్లా రాజవరంలో పాగాల సంపత్ రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చిన కేటీఆర్

Jyothi
Published on: 5 Dec 2023 2:51 PM IST
KTR Paid Tributes To The Body Of Pagala Sampath Reddy
X

KTR: పాగాల సంపత్‌రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్‌

KTR: జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి కేటీఆర్... జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం చేరుకున్న కేటీఆర్ సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. సంపత్ రెడ్డి మృతి తీవ్ర మనోవేదన కలిగించిందని, ఆయన మరణం పార్టీకి, శ్రేణులకు తీరని లోటన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్‌గా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story