ఫార్మాసిటీ అంటేనే ఒక కుంభకోణం : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫార్మాసిటీ అంటేనే ఒక కుంభకోణం : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
x
Highlights

తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి...

తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక సభలో ఆయన మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని వెంకటరెడ్డి అన్నారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలపై టీఆర్ఎస్ నేతలు పడ్డారని ఆయన మండిపడ్డారు. రూ.3 లక్షల కోట్లు స్వాహా చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. ఫార్మాసిటీ అంటేనే ఒక కుంభకోణమని అధికార పార్టీ నేతలు డబ్బులు సంపాదించుకునేందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఫార్మా సిటీ శాపంగా మారిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఫార్మా సిటీతో నేల, గాలి, నీరు కలుషితం అవుతాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గతంలో చౌటుప్పల్ ఏరియాలో ఫార్మా సిటీ కంపెనీలు పెట్టడంతో ఇప్పటికే అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. గ్రీన్ ఫార్మా సిటీపై కేసు వేయనున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.12 లక్షలు ఇచ్చి కంపెనీలకు రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇక్కడ ఎలాంటి శంకుస్థాపనలు చేయకుండా అడ్డుకోవాలని, భూములివ్వకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఫార్మా సిటీ పోరాటం రాష్ట్ర గతిని మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories