ఎన్టీఆర్ అప్పట్లో అగ్నివేశ్ మాటలు పాటించారు : కోదండరాం

ఎన్టీఆర్ అప్పట్లో అగ్నివేశ్ మాటలు పాటించారు : కోదండరాం
x
Highlights

ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ఢిల్లీలో చికిత్స పొందుతూ గతరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు...

ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ఢిల్లీలో చికిత్స పొందుతూ గతరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అగ్నివేశ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఎన్టీఆర్ అంతటివాడు అగ్నివేశ్ సూచనలతో గతంలో సన్యాసం స్వీకరించి కాషాయం ధరించారని, అగ్నివేశ్ ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి అని కోదండరాం వెల్లడించారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు స్వామి అగ్నివేశ్ మృతి తీరని నష్టం అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రముఖ సంఘసేవకుడిగా మన్ననలు అందుకున్న స్వామి అగ్నివేశ్ వచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో ఉన్న స్వామి అగ్నివేశ్ ను చూసి ఆశ్చర్యపోయారు.

అంతే కాదు ఆయన మనసులో ఉన్న ఓ సందేహాన్ని కూడా అడిగారు. మీరు సన్యాసం స్వీకరించడానికి గల కారణాలు ఏంటి అని అగ్నివేశ్ ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నను విన్న అగ్నివేశ్ వెంటనే ఆయనకు బదులిస్తూ సన్యాసిగా ఉండడం వల్ల ఎలాంటి స్వార్థం దరిచేరేందుకు అవకాశం ఉండదని తెలిపారు. అలా ఉన్నప్పుడే మన కోసం, మర స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తామని వెల్లడించారు. అంతే కాదు అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ కు మీరు కూడా సన్యాసం స్వీకరించండి అని బోధించాడు. సన్యాసం స్వీకరించి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయండి అంటూ ప్రబోధించారు. అది విన్న ఎన్టీఆర్ కొన్ని రోజుల్లోనే కాషాయం ధరించారు. కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్ ఆ కాషాయ వేషధారణలోనే ప్రజలను పాలించారు. 80వ దశకంలో తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ సీఎం అయిన కొంతకాలానికి కాషాయం ధరించి అదే వేశధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎన్టీఆర్ అలా చేయడానికి స్వామి అగ్నివేశ్ ప్రబోధనలే అందుకు కారణం.

Show Full Article
Print Article
Next Story
More Stories