పారిశ్రామిక వాడలో ఘనంగా కైట్ ఫెస్టివల్

పారిశ్రామిక వాడలో  ఘనంగా కైట్ ఫెస్టివల్
x
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Highlights

సంప్రదాయ పండుగల సంస్కృతిని కాపాడుకునే విధంగా అందరితో కలిసి పండుగలను జరుపుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

పఠాన్ చేరు: సంప్రదాయ పండుగల సంస్కృతిని కాపాడుకునే విధంగా అందరితో కలిసి పండుగలను జరుపుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పఠాన్ చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గాలిపటం ఎగురవేసి కాసేపు సందడి చేశారు. వివిధ పార్టీ నాయకులు, మహిళలు, యువత, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని గాలిపటలు ఎగురవేస్తూ నూతన మార్కెట్ సముదాయం కోలాహలంగా మారింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, తేరాస టౌన్ ప్రెసిడెంట్ విజయ్, మహిళ విభాగం టౌన్ ప్రెసిడెంట్ జయశ్రీ, మాజీ ఉప సర్పంచ్ అప్జల్, యువ నాయకులు గూడెం మధు, విక్రమ్ ముదిరాజ్, మాజీ వార్డ్ మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ, పట్టణ నాయకులు, ఎం డి ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories