Kishan Reddy: కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు

Kishan Reddy: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి

Shekhar G
Published on: 18 Oct 2023 7:15 PM IST
Kishan Reddy Comments On Rahul And Priyanka Gandhi
X

Kishan Reddy: కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు

Kishan Reddy: రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి అక్కడి ప్రజలను మోసం చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో యువత చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని విమర్శించారు. బీఆర్ఎస్‌పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఏ వర్గానికి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story