Kishan Reddy: కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది

Kishan Reddy: కాంగ్రెస్‌ను గెలిపిస్తే సోనియాకు, రాహుల్‌కు ఊడిగం చేస్తారు

Shekhar G
Published on: 21 Feb 2024 7:37 PM IST
Kishan Reddy Comments On BRS And KCR
X

Kishan Reddy: కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది

Kishan Reddy: కాంగ్రెస్‌ పాలనలో అన్నీ కుంభకోణాలే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. దేశం మొత్తాన్ని కాంగ్రెస్‌ దోచుకుందని, మోడీ అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్నారన్నారు. దేశ ప్రజలే మోడీ కుటుంబ సభ్యులంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఆ పార్టీని గెలిపిస్తే సోనియాకు, రాహుల్‌కు ఊడిగం చేస్తారంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందంటూ విమర్శించారు కిషన్‌రెడ్డి. దేవరకద్ర పట్టణంలో విజయ సంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story