
MLC Kavitha: గ్రూప్-1పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కవిత ట్వీట్
MLC Kavitha: రోస్టర్ పాయింట్లు లేకుండా.. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఎలా?
MLC Kavitha: అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఎక్స్ లో విమర్శించారు. ఇటీవల జారీచేసిన గ్రూప్–1 నోటిఫికేషన్.. రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ పద్ధతితో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అసలు రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా..? అని ఆమె ప్రశ్నించారు.
563 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.
అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోంది. ఇటీవల జారీ చేసిన గ్రూప్ - 1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉంది. దీని వల్ల బిసి, ఎస్సీ, ఎస్టి మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 21, 2024
రోస్టర్… pic.twitter.com/D93HazdFrj

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




