ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జె.సి యాదిరెడ్డి

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జె.సి యాదిరెడ్డి
x
ఫిర్యాదులను స్వీకరిస్తున్న జేసీ యాదిరెడ్డి
Highlights

ప్రతి నెల శనివారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా, బిచ్కుంద పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో ఫిర్యాదులను స్వీకరించారు.

బిచ్కుంద: ప్రతి నెల శనివారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా, బిచ్కుంద పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో, జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని పలువురి నుంచి ఫిర్యాదులను జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్లు స్వీకరించారు.

ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ...ఈరోజు ప్రజావాణిలో భాగంగా, నియోజకవర్గంలోని 6మండలాలకు చెందిన ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని, ఆ ఫిర్యాదులను ఆయా శాఖలకు సాయంత్రం లోపు పంపిస్తామని, వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల లోపు సమస్యలపై ఎంక్వైరీ చేయించి, నిర్ధారణ చేసుకున్న పిదప సమస్య పరిష్కరిస్తామని, లేకుంటే సమాధానాలు రాసి ఆ ఫిర్యాదు దారుడికి తెలుపుతామని ఆయన అన్నారు.

బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి గ్రామం 161జాతీయ రహదారిలో గ్రామంలోని కొన్ని ఇండ్లు కోల్పోతున్న వారికి, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని సర్పంచ్ గంగారాం జె.సికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, ఫిర్యాదు దారులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories