Devarayamjal: దేవరయంజాల్ భూములపై ఐఏఎస్ కమిటీ దర్యాప్తు

Devarayamjal: ఇప్పటికే ఈ భూములపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది

Sandeep Eggoju
Updated on: 5 May 2021 5:07 PM IST
IAS Committee Investigating on Devarayamjal Lands
X

దేవరాయాంజాల్ భూముల దర్యాప్తు (ఫైల్ ఇమేజ్)

Devarayamjal: దేవరయాంజల్ భూములపై ఐఏఎస్ కమిటీ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ భూములపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. దేవాదాయ అధికారులపై ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆలయ ఈవో చంద్రమోహన్‌ను ప్రభుత్వం తప్పించి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసింది. దేవాదాయశాఖ ట్రిబ్యునల్ మెంబర్ జ్యోతిని కూడా అధికారులు తప్పించారు.. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీతారామ స్వామి టెంపుల్ ఈవోగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ కమిటీ కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక రోజువారి విచారణ కోసం తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. వివిధ శాఖల నుంచి సీనియర్ అధికారులను కమిటీకి సహకరించేందుకు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story