హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Arun Chilukuri
Updated on: 19 Dec 2020 4:55 PM IST
హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. ముఖ్యమత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా ప్రతినెలా 20 వేల లీటర్ల తాగు నీరు ఉచితంగా పంపిణీ చుయనున్నట్లు తెలిపారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణపై ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులకు జనవరిలో వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story