కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
x
Highlights

former mp Nandi Yellaiah passes away: కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో...

former mp Nandi Yellaiah passes away: కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. జులై 29న నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత పది రోజుల నుంచి కరోనా చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నంది ఎల్లయ్య ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories