కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి (93) కన్నుమూత

Former minister P. Narsa Reddy (93) Passed Away
x

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి (93) కన్నుమూత

Highlights

Narsa Reddy: సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన నర్సారెడ్డి

Narsa Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుది‌‌‌శ్వాస విడిచారు. నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్‌ చించోలి గ్రామంలో జన్మించారు. 1971-72లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ‌్యక్షుడిగా పని చేశారు. మాజీ సీఎం జళగం వెంగళరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పనిచేశారు. నర్సారెడ్డి మృతిపై పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories