ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత
ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు శామీర్పేట్కు చెందిన భిక్షపతి. భూ వివాదంలో శామీర్ పేట్ SI సంతోష్ తనకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. తన ఒకటిన్నర గుంటల భూమి వేరే వ్యక్తులకు కట్టబెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. SI తీరును నిరసిస్తూ కిరోసిన్ పోసుకోగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు భిక్షపతి, భార్య బుచ్చమ్మపై నీళ్లు పోసారు. అనంతరం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Next Story




