కల్వకుంట్ల కవిత అరుదైన రికార్డు

కల్వకుంట్ల కవిత అరుదైన రికార్డు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా నాయకురాలు మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళా నాయకురాలుగా తెలంగాణ ఉద్యమంలో మహిళా గొంతును...

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా నాయకురాలు మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళా నాయకురాలుగా తెలంగాణ ఉద్యమంలో మహిళా గొంతును ఎలుగెత్తి చాటిన నేతగా, తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగిడి, అతి తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచి, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధిగా సుపరిచితురాలు అయ్యింది. అంతే కాదు సామాజిక వ్యవహార శైలి పరంగా, రాజకీయ పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇప్పుడు సరికొత్తగా మరో ఘనతను సాధించింది. ట్విట్టర్లో తాజాగా సరికొత్త ట్రెండ్ సృష్టించి. దక్షిణ భారతదేశ తొలి మహిళా రాజకీయ నాయకురాలిగా ట్విట్టర్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ నిలిచారు.

దశాబ్దకాలం క్రితం 2010 సంవత్సరంలో మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని, తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా నలుదిశలా చాటారు. మాజీ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ పదానికి చోటు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించిన మాజీ ఎంపీ కవిత, వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు సైతం బతుకమ్మ విశేషాలు తెలియజేసేలా ట్విట్టర్ ను ఒక మాధ్యమంగా ఉపయోగించారు. దీంతో ఆమెకి సుమారుగా ఒక మిలియన్ ఫాలోవర్స్ వొచ్చారు.

ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్దఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు. మాజీ ఎంపీ కవిత దశాబ్ద కాలంగా ట్విట్టర్ లోనూ ఎప్పటికప్పుడు ప్రజా క్షేత్రంలో చురుగ్గా ఉంటూ, ప్రజలతో మమేకం అవుతూనే వివిధ అంశాలను షేర్ చేస్తుంటారు. రాఖీ పండుగనాడు ప్రతి మహిళ తమ సోదరులకు రాఖీ కట్టడంతోపాటు ఒక హెల్మెట్‌ను బహూకరించాలని కవిత ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నారు.

మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ఎంపీ కవిత. పార్లమెంటులో వివిధ అంశాలపై మాట్లాడుతూ తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న కవిత, బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో, బీడీ కార్మికుల సంక్షేమంపై చట్టసభలతో పాటు, ట్విట్టర్ లో సైతం నిరంతరం ప్రస్తావించారు. మాజీ ఎంపీ కవిత తర్వాత దక్షిణాది నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన మహిళా నేతలలో డీఎంకే ఎంపీ కనిమొళి, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీ శోభ తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories