ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపుల కేసు
ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని మహేష్రెడ్డిపై ఫిర్యాదు చేసింది ఆయన భార్య భావన. తనను పెళ్లి చేసుకొని ఇప్పుడు తెలియదంటున్నాడని వాపోయింది. చదువుకునే సమయంలో తమ మధ్య పరిచయం ఏర్పడిందని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నామని ఆమె తెలిపింది. ఏడాదిగా ఒకే దగ్గర ఉంటున్నామని ఐపీఎస్కు సెలక్ట్ అయినప్పటి నుండి మహేష్రెడ్డిలో మార్పువచ్చిందని భావన ఆరోపిస్తోంది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని చెప్పినట్లుగా ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మహేష్ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.
Next Story




