Bhadrachalam Ramalayam: దేవుని పేరిట మోసం..సామాన్యులను వదలని సైబర్ నేరగాళ్లు..

Bhadrachalam Ramalayam: దేవుని పేరిట మోసం..సామాన్యులను వదలని సైబర్ నేరగాళ్లు..
x
Highlights

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కొంత మంది ఆన్ లైన్ ద్వారా ప్రజలను మోసం చేసి వారి డబ్బులను కాజేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఆ దేవున్ని కూడా వదలడం లేదు. దేవుని పేరు చెప్పుకుని మోసం చేసి డబ్బును దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కాస్త ఆలస్యంగా బహిర్గమైంది. భద్రాద్రి రాముడి పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించి డబ్బులు కొట్టేస్తున్న వైనం ఇటీవల వెలుగు చూసింది.

అసలు ఈ ఘరానా మోసం ఎలా బయటపడిందో పూర్తివివరాల్లోకెళ్తే వరంగల్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ అనే ఓ వ్యక్తి ఈ మధ్య కాలంలో భద్రాచలం రామాలయం పేరిట ఓ పేజిని వికిపీడియాలో ఓపెన్ చేశాడు. ఆ తరువాత అదే పేజీలో ఉన్న లింక్ ద్వారా భద్రాచలం రామాలయం వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేశాడు. అనంతరం భద్రాద్రి రామాలయంలో పూజల కోసం ఆన్ లైన్ లో నగదు చెల్లించాలనుకున్నాడు. ఆ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం గూగుల్ పే ద్వారా డబ్బులను చెల్లించాడు. డబ్బులు రిసీవ్ అవ్వగానే ఆ వ్యక్తికి వచ్చిన వివరాలను పరిశీలిస్తే గూగుల్ పే ఐఎఫ్ఎస్‌సీ కోడ్ జనగామ జిల్లా పాలకూర్తి ఎస్‌బీహెచ్ బ్రాంచ్ అని చూపించింది.

దీంతో ఓ వ్యక్తికి అనుమానం కలిగింది. కాగా ఆ వ్యక్తి వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. పోలీసుల సాయంతో కూపీ లాగాడు. దీంతో అసలు నిజం బయట పడింది. కూపీలో దొరికి ఫోన్ నంబర్ ఆధారంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు భద్రాద్రి రాముడి పేరిట ఆ యువకుడు భక్తులను మోసం చేస్తున్నాడని గుర్తించి సంబంధిత సమాచారాన్ని ఆలయ ఈవో దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన పూర్తి ఆధారాలను సేకరించి భద్రాచలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories