CPI Narayana: పంజాగుట్టలో ప్రారంభమైన సిపిఐ పాదయాత్ర.. పాల్గొన్న నారాయణ

CPI Narayana: బీజేపీ హటావో దేశ్ కో బచావో పేరుతో కరపత్రాలు

Dhatripriya
Published on: 2 May 2023 6:39 PM IST
CPI Started Padayatra In Punjagutta
X

CPI Narayana: పంజాగుట్టలో ప్రారంభమైన సిపిఐ పాదయాత్ర.. పాల్గొన్న నారాయణ

CPI Narayana: బీజేపీ హటావో దేశ్ కో బచావో పేరుతో సిపిఐ ఇంటింటి ప్రచారంలో భాగంగా పంజాగుట్టలో సిపిఐ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న నారాయణ సమీపంలోని షాపు షాపుకు తిరిగి కరపత్రాలు పంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై కరపత్రాలను వేశామన్నారు. అనంతరం పంజాగుట్ట స్మశాన వాటికకు చేరుకున్న ఆయన నూతనంగా నిర్మించిన పంజాగుట్ట స్మశాన వాటికను పరిశీలించారు. చివరికి స్మశాన వాటికలో పని చేసే వారి నోట్లో కూడా ప్రభుత్వం మట్టికొడుతుందని. మోడీ హయంలో స్మశాన వాటిక కాంట్రాక్టు కూడా ధనవంతులకు ఇస్తున్నారన్నారు. చెప్పుల మీద కూడా 18 శాతం gst వసూలు చేస్తున్నారని... పేదల చెప్పుల మీద gst వేసే వాళ్ళను దేనితో కొట్టాలి నారాయణ ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story