నాగులపల్లి రోడ్డు వెంతెనలు వెంటనే పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్

నాగులపల్లి రోడ్డు వెంతెనలు వెంటనే పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్
x
జిల్లా అధ్యక్షులు టీ నరేష్, మండల కార్యదర్శి మొగులయ్య, యాదయ్య, ఆడివయ్య, మౌలానా
Highlights

మండలంలోని నాగులపల్లి గ్రామంలో ఉన్నటు వంటి శివాలయం దగ్గర నుండి, నాగులపల్లి శివారు వరకు రోడ్డు అధ్వానంగా మారిందని సీపీఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్జిగాళ్ల నర్సింలు పేర్కొన్నారు.

వట్ పల్లి: మండలంలోని నాగులపల్లి గ్రామంలో ఉన్నటు వంటి శివాలయం దగ్గర నుండి, నాగులపల్లి శివారు వరకు రోడ్డు అధ్వానంగా మారిందని సీపీఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్జిగాళ్ల నర్సింలు పేర్కొన్నారు. సీపీఐ నాయకులు రోడ్డు, వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్సిములు మాట్లాడుతూ... రోడ్డు పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా నాగులపల్లి గ్రామ శివారులో ఉన్న వంతెనలు వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా రోడ్డు కోసం ఎన్ని సార్లు అధికారులను కోరినా స్పందన ఏం లేదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డు పనులు వేగవంతం చేయాలని, రోడ్డు మొత్తం గుంతల మయంగా మారడంతో వాహన దారులకు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్, జిల్లా మండల అధికారులు స్పందించి, పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ, వైసిపి అద్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టీ నరేష్, సిపిఐ మండల కార్యదర్శి మొగులయ్య, యాదయ్య, ఆడివయ్య, మౌలానా, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories