కేటీఆర్‌ పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. సంజయ్‌కు కోర్టు ఆదేశాలు..

Court Interim Orders in Defamation Suit Filed by KTR Against Bandi Sanjay
x

కేటీఆర్‌ పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. సంజయ్‌కు కోర్టు ఆదేశాలు..

Highlights

City Civil Court: మంత్రి కేటీఆర్‌ పరువుకు భంగం కలిగే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టు ఆదేశించింది.

City Civil Court: మంత్రి కేటీఆర్‌ పరువుకు భంగం కలిగే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టు ఆదేశించింది. ఈ మేరకు 2వ అదనపు చీఫ్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించి, తన పరువుకు భంగం వాటిల్లేలా బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారని, ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోరుతూ కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. నిన్న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ''కేటీఆర్‌ పరువుకు నష్టం కలిగేలా మీడియా, సామాజిక మాధ్యమాలు, ఇంటర్వ్యూలు, సభల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు'' అని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories