తెలంగాణలో ఒక్కరోజే 300 కరోనా పాజిటివ్ కేసులు!

తెలంగాణలో ఒక్కరోజే 300 కరోనా పాజిటివ్ కేసులు!
x
Highlights

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకేరోజులో 300 కేసులు నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే...

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకేరోజులో 300 కేసులు నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే 300 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 352 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ 230 మంది డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మరణించారు.

గురువారం హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 302 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రంగారెడ్డి 17, మేడ్చల్ 10, మంచిర్యాలలో 4, జనగాంలో 3, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డిలో 2 చొప్పున, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్‌లో ఒక కేసు చొప్పున పాజిటివ్ వచ్చాయి.

తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3,301 మంది కోలుకోగా.. 195 మంది చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం 2,531 యాక్టివ్ కేసులున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories