జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం
x
Highlights

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా నగరంలోని గ్రేటర్‌...

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని నాల్గో అంతస్తులోని ఓ సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ అంతస్తులోని ఉద్యోగులను ఇళ్లకు పంపి.. శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. బల్దియా కార్యాలయంలో దాదాపు 1500 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,650 కేసులు నమోదు కాగా, ఇందులో 137 మంది మరణించారు. 1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,771 మంది గాంధీ ఆస్పత్రిలో చకిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories