టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి
x
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేంద్ర వ్యవ‌సాయ‌ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పాల‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి డిమాండ్...

టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేంద్ర వ్యవ‌సాయ‌ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పాల‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నిజంగా ఆ చ‌ట్టాన్ని వ్యతిరేకించినట్లయితే లోక్ సభలో చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను లోక్ సభలో వ్యతిరేకించారని, కానీ టీఆర్ఎస్ మాత్రం ఆ విష‌యంలో ట్రాన్స్ జెండర్‌లా వ్యవహరించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని జీవన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయా అసెంబ్లీల్లో తీర్మానం చేశార‌ని, తెలంగాణలో కూడా అదే తరహాలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పంట బీమా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యత విస్మరించడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింద‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ఉందని, రెండూ కలిసి తోడు దొంగల్లా తయారయ్యాయని ఎద్దేవా చేశారు. క్వింటాల్‌కు రూ.1,850 ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories