తెలంగాణలో నవంబర్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం

తెలంగాణలో నవంబర్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలను ఈనెల 15 నుంచి పునః ప్రారంభించడం సాధ్యంకాదని మంత్రుల సబ్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ నెలలో...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలను ఈనెల 15 నుంచి పునః ప్రారంభించడం సాధ్యంకాదని మంత్రుల సబ్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ నెలలో వచ్చే పండగల తరువాత పరిస్థితులను సమీక్షించి స్కూళ్లు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల సబ్‌ కమిటీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు దసరా, దీపావళీ పండుగలు ముగిసిన తరువాత పరిస్థితులను బట్టి తుది నిర్ణయం వెలువడనుంది.

ఇక పోతే నవంబర్‌ 1 నుంచి యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు యథావిధిగా ప్రారంభమవుతాయని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌తో కూడిన సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభమైతే విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికపప్పుడు పరిశీలించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పాఠశాలలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆగిపోకుండా ఉండేందుకు డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సూచించారని చెప్పారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరి అవుతుందని అందరికీ విద్య అందేలా చూడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 96% మందికి టీవీలున్నాయని.. 40% మందికి ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్నదని ఆమె తెలిపారు. 86% మందికి ఆన్‌లైన్‌ విద్య అందుతున్నట్టు సర్వేలో తేలిందని పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు సగం మందితోనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున మిగతా వారికి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాల్సి ఉంటుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories