ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలి: కలెక్టర్ ప్రశాంతి

ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలి: కలెక్టర్ ప్రశాంతి
x
Highlights

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లను స్క్రూటిని చేపట్టాలని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

నిర్మల్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లను స్క్రూటిని చేపట్టాలని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.

నామినేషన్ల తిరస్కరణ విధానాన్ని రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ డి.ఇ. సంతోష్ కుమార్, కామారపు జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories