Revanth Reddy: నేడు అల్వాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy Visit to Alwal Today
x

Revanth Reddy: నేడు అల్వాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Highlights

Revanth Reddy: హైదరాబాద్‌-రామగుడం రాజీవ్‌ రహదారిపై.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు భూమిపూజ చేయనున్న సీఎం

Revanth Reddy: నేడు సీఎం రేవంత్‌రెడ్డి అల్వాల్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ రామగుండం రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు..భూమి పూజ చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నారు.

హైదరాబాద్, రామగుండం రాజీవ్ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భారీ ఎలివేటెడ్ కారిడార్కు సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భారీ ఎలివెటెడ్ కారిడార్‌ నిర్మాణం..11.30 కిలోమీటర్ల పొడవు 6లేన్ల వెడల్పుతో జరుగనుంది. దీంతో సికింద్రాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నారు. కరీంనగర్ వైపు మెరుగైన రవాణ సదుపాయాలు కల్పించడంలో భాగంగానే హైదరాబాద్, రామగుండం రహదారికి మహర్ధశ పట్టనుంది.

హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం పట్టణాలను కలిపే రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఇటీవల కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న సీఎం రేవంత్ రెడ్డి .. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతివ్వాలని లేఖను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. దీంతో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం 2వేల 232 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories