ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం
x

ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

Highlights

Statue Of Equality: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.

Statue Of Equality: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేకపోయారు. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి మోడీకి స్వాగతం పలికారు. తలసానితో పాటు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నిజానికి, ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి కేసీఆర్‌ వెళ్లడం లేదన్న ప్రచారం శుక్రవారమే జరిగింది. ఇందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను నియమించారంటూ నియామక పత్రం ఒకటి వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కూడా కొట్టింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య విభేదాల కారణంగానే కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారనే ప్రచారం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories