Medak: పౌల్ట్రీ నిర్వాహకుల పాలిట శాపంగా మారిన కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

Medak: పౌల్ట్రీ నిర్వాహకుల పాలిట శాపంగా మారిన కోవిడ్‌-19 ఎఫెక్ట్‌
x
Highlights

కరోనా అంటేనే ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. ఆ వైరస్‌ అంటే భయం పౌల్ట్రీ నిర్వాహకుల పాలిటశాపంగా మారింది.

మెదక్‌: కరోనా అంటేనే ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. ఆ వైరస్‌ అంటే భయం పౌల్ట్రీ నిర్వాహకుల పాలిటశాపంగా మారింది. చికెన్‌ తింటే కరోనా వ్యాధిసోకుతుందని కొందరు సోషల్‌ మీడియాలో కథనాలు పెట్టడటంతో, చికెన్‌ తినేందుకు జనం జంకుతున్నారు. కొనేవారు లేక రెండునెలలు నిండినా కోళ్లుఫారాల్లోనే మగ్గుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రనష్టాల పాలవుతున్నారు. మెదక్‌ జిల్లాలో సుమారు 1,876 కోళ్లఫారాలు ఉన్నాయి.

వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 10వేల మంది ఆధారపడి జీవనం జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో చెప్పుకోదగ్గ నీటిప్రాజెక్టులు లేక పోవటంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయంలో వరుసనష్టాలు వస్తుండటంతో, కొందరు రైతులతో పాటు నిరుద్యోగులు బ్యాంకుల్లో రుణాలు పొంది కోళ్లఫారాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ప్రపంచాన్ని వణికించే కరోనా వైరస్‌ కోళ్లను తింటే వస్తుందని కొందరు సోషల్‌ మీడియాల్లో కథనాలను పెట్టడంతో చికెన్‌ అమ్మకాలు తగ్గాయి.

రెండునెలలుగా ఫారాల్లోనే...

కోళ్లఫారాల్లో ఒక్కోబ్యాచ్‌ని కేవలం 45 రోజుల పాటు మాత్రమే పెంచుతారు. అంతకుమించి ఒక్కరోజు కూడ ఫారాల్లో ఉంచరు. ఎందుకంటే కోడిపెరుగు దల 45 రోజులు దాటితో పూర్తిగా నిలిచిపోతోంది. అప్పటికే ఒక్కో కోడి 2.50 కిలోల నుంచి 3 కిలోల బరువు వస్తోంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌ బూచితో చికెన్‌ తినేవారు వెనుకడుగు వేయటంతో, కోళ్లు ఫారాల్లోనే ఉంటున్నాయి. రెండు నెలలు గడిచిపోయినా కోళ్ల యజమానుదారులు వాటిని సకాలంలో తీసుక పోకపోవటంతో ఫారాల్లోనే మగ్గుతున్నాయి.

రెండుమాసాలు గడిచిపోవటంతో కోళ్లు అధిక బరువుతో మృత్యువాత పడుతున్నాయి. చనిపోయిన కోళ్లకు సదరు యజమాని ఫౌల్ట్రీ రైతులకు డబ్బులు ఇవ్వరు. దీంతో రెండు నెలలపాటు పెరిగిన కోడిచనిపోవటం వల్ల తీవ్ర నష్టాల పాలౌతున్నారు. అంతే కాకుండా 45 రోజుల్లో బ్యాచ్‌ని తీసుక పోతే మరోబ్యాచ్‌ని వెనువెంటనే వేసుకుని, పెంచుకుంటే సదరు రైతుకు లాభాలు వస్తాయి. కానీ రెండు నెలలపాటు ఫారాల్లోనే ఉండటంతో అన్ని విధాలుగా రైతులు నష్టాలు పాలవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories