KTR: కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు
KTR: ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం విఫలమైంది
KTR
KTR: భారీ వర్షాల సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందని ఎక్స్ వేదికగా విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల్లోనూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో నిమగ్నమయ్యారని అన్నారు. ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సే అని మరోసారి రుజువు చేశారంటూ కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు.
Next Story




