Eleti Maheswar Reddy: రేవంత్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో.. రాజీనామా చేయించి బై ఎలక్షన్స్‌కు రావాలి

Eleti Maheswar Reddy: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 19 Nov 2025 1:39 PM IST
Eleti Maheswar Reddy: రేవంత్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో.. రాజీనామా చేయించి బై ఎలక్షన్స్‌కు రావాలి
X

Eleti Maheswar Reddy: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్‌కు రావాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైరయ్యారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story