వినాయక నిమజ్జనంపై వివాదం.. శుక్రవారమే జరిపి తీరుతామంటున్న ఉత్సవ సమితి

Bhagyanagar Ganesh Utsav Samithi Press Meet on Ganesh Immersion
x

వినాయక నిమజ్జనంపై వివాదం.. శుక్రవారమే జరిపి తీరుతామంటున్న ఉత్సవ సమితి

Highlights

Bhagyanagar Ganesh Utsav Samithi: వినాయక నిమజ్జనోత్సవం పై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక వ్యాఖ్యలు చేసింది.

Bhagyanagar Ganesh Utsav Samithi: వినాయక నిమజ్జనోత్సవం పై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. నిమజ్జనోత్సవం తేదీపై కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 9వ తేదీననే నిమజ్జనోత్సవం కొనసాగుతుందని చెప్పారు. హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. భక్తుల మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రేపు హుస్సేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ఉత్సవ సమితి సభ్యులు వెల్లడించారు.

కుంటల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదని, బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ద వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదని సమితి సభ్యులు ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించాలని గణేష్‌ ఉత్సవ సమితి కోరింది. భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతిస్తోందని ఆరోపించింది. లౌడ్‌ స్పీకర్లు తీసేయాలని కోర్టు ఆదేశించింది. ఎన్ని ప్రార్థనా స్థలాల్లో స్పీకర్లు తొలగించారు అంటూ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories