Telangana: బ్యాంకు సిబ్బంది దౌర్జన్యం.. లోన్ కట్టలేదని.. రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు..

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో బ్యాంకు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు.

Arun Chilukuri
Published on: 15 March 2023 1:20 PM IST
Bank Staff Takes House Doors as they Fail to pay Debt
X

Telangana: బ్యాంకు సిబ్బంది దౌర్జన్యం.. లోన్ కట్టలేదని.. రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు..

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో బ్యాంకు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. లోన్‌ డబ్బులు కట్టలేదని ఓ ఇంట్లో సామాగ్రిని, ఇంటి తలుపులను తీసుకెళ్లారు. ఈ ఘటన మదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది. 2021లో మోహన్ అనే రైతు సహకార బ్యాంకు నుంచి వ్యవసాయ ఋణం తీసుకున్నాడు. మూడు నెలల నుంచి నెలవారి వాయిదాలు కట్టకపోవడంతో మోహన్ కుమారుడు ఇంటికి వెళ్లారు సహకార బ్యాంకు సిబ్బంది. పోలీస్ సిబ్బందితో వెళ్లి సామాగ్రి తీసుకొని వెళ్లారు. విషయం తెలుసుకున్న డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే బాధితుడి ఇంటి సామాగ్రిని అప్పగించారు బ్యాంకు సిబ్బంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story