Hyderabad: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం- సజ్జనార్‌

ASI Mahipal Reddy Funeral Held with Full Honour
x

Hyderabad: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం- సజ్జనార్‌

Highlights

Hyderabad: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఈ తనిఖీల్లో ఉన్న సిబ్బంది భద్రత విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు సీపీ సజ్జనార్‌.

Hyderabad: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఈ తనిఖీల్లో ఉన్న సిబ్బంది భద్రత విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు సీపీ సజ్జనార్‌. ఈ నెల 27న నిజాంపేటలో జరిగిన ఘటన రెండు కుంటుంబాల్లో విషాదాన్ని నింపిందని ఆయన అన్నారు. ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సజ్జనార్‌ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సజ్జనార్ మహిపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనంతో మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో మహిపాల్ రెడ్డి పాడెను సజ్జనార్ మోశారు. అంత్యక్రియల ఖర్చులకు సజ్జనార్‌ రూ.50 వేలు వ్యక్తిగత సహాయం చేశారు. ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన కుటుంబసభ్యులను సీపీ సజ్జనార్‌ అభినందించారు. బాధిత కుటుంబానికి శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories