ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
x
Highlights

కొద్ది రోజుల క్రితం కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు లంచం తీసుకుంటూ దొరికిన ఉదంతం మరచిపోకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ అడిషనల్ కలెక్టర్...

కొద్ది రోజుల క్రితం కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు లంచం తీసుకుంటూ దొరికిన ఉదంతం మరచిపోకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కైపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లక్షలు రూపాయలను తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ నర్సపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. దాని కోసం ఏకంగా రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తరువాత కాసేపు మాట్లాడుకుని ఎకరాకు లక్ష చొప్పున ఇవ్వాలంటూ రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే పూర్తి మొత్తం నగదు కాకుండా తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని, రూ.40 లక్షల నగదు ఇవ్వాలని కోరారు. కాగా అందులో భాగంగానే రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. అంతే కాదు ఏసీబీ అధికారులు మాచవరంలోని నగేష్ ఇంట్లో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. అంతే కాకుండా ఏకకాలంలోనే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ తనిఖీల్లో నగేష్‌ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్‌ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అడిషనల్ కలెక్టర్ నగేష్‌.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మూర్తి 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో ఏసీబీని ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ వెంటనే రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా నగేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు. అంతే కాక మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories