ఏబీవీపీ 38 వ రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు విడుదల

ఏబీవీపీ 38 వ రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు విడుదల
x
జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్, కార్యకర్తలు తుమ్మ అనిల్, కావ్య, సహన, శ్రావణి, హసన్ బాబు, రాజ్ కుమార్
Highlights

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర 38వ మహా సభల గోడ పత్రికలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.

ధర్మారం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర 38వ మహా సభల గోడ పత్రికలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ... ఈ నెల 17,18,19,20వ తేదీలలో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గత 70 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు.

ఈ యొక్క మహా సభలలో విద్యారంగ, ఆర్థిక, నిరుద్యోగ స్థితి గతుల పై, మహిళల పై జరుగుతున్న అత్యాచారాల పై తీర్మానాలు చేయడం జరుతుందని అన్నారు. ఈ యొక్క మహా సభలకు రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు, ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సభలలో 2000మంది విద్యార్థి పరిషత్ పాల్గొననున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్, కార్యకర్తలు తుమ్మ అనిల్, అరికిల్ల అజయ్, దొంత హర్షవర్ధన్, కావ్య, సహన, శ్రావణి, హసన్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories