డాలర్ భాయ్ ఒత్తిడితోనే సెలబ్రిటీల పేర్లు చెప్పాను.. అత్యాచార బాధితురాలు

డాలర్ భాయ్ ఒత్తిడితోనే సెలబ్రిటీల పేర్లు చెప్పాను.. అత్యాచార బాధితురాలు
x
Highlights

తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు...

తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్ బాయ్ అలియాస్‌ శ్రీకర్‌రెడ్డి ఒత్తిడి ఉందని మీడియాకు తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశాను. ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పాలో రాత్రిపూట డిక్టేట్‌ చేసేవాడు. నా వల్ల అమాయకులకు శిక్ష పడకూడదనుకున్నాను. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను బెదిరించారు. 139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు. నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశాను.

డాలర్‌ భాయ్‌తో నాపట్ల అమానుషంగా వ్యవహరించాడు. నాకు జరిగిన అన్యాయం, మరెవరికీ జరగకూడదు. చెప్పినట్లు చేయకపోతే కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడు. డాలర్ భాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు చేర్చాల్సి వచ్చింది. అంతేకాదు నటుడు కృష్ణుడికి కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నన్ను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్‌లో మాట్లాడించారు. నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు. సంబంధం లేదని చెప్పినా సెలబ్రిటీల పేర్లు చేర్చారు' అని బాధిత యువతి చెప్పింది. కాగా, కొన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు బాధితురాలికి మద్దతు ప్రకటించాయి. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశాయి. మంద కృష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories