Hyderabad: అర్ధరాత్రి వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి డోర్..

A Man Brutally Losts  His Life in Neredmet Hyderabad
x

Representational Image

Highlights

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది.

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. నెరేడ్మెట్‎లో అర్ధరాత్రి అనంతనగర్ కాలనీలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్యామ్ సుందర్‎ను గుర్తు తెలియని దుండగుడు హత్య చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి డోర్ కొట్టడంతో తలుపు తెరిచిన శ్యామ్ సుందర్‎తో దుండగుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో అదికాస్త పెద్ద‌ద‌య్యింది. ఈ క్ర‌మంలో దుండ‌గుడు నిద్రమత్తులో ఉన్న శ్యామ్‎ త‌ల‌పై సిమెంట్ ఇటుకతో బ‌లంగా కొట్టాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. దీంతో శ్యామ్ తల్లి రేణుక పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories