Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ కు దూసుకెళ్లిన సింధూ

Tokyo Olympics: PV Sindhu Enters Semis
x

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ కు దూసుకెళ్లిన సింధూ

Highlights

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత దగ్గజ ప్లేయర్ పీవీ సింధు సెమీస్‌కు చేరుకుంది.

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత దగ్గజ ప్లేయర్ పీవీ సింధు సెమీస్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన రెండో సెట్‌లో పీవీ సింధు విజయం సాధించింది. జపాన్ క్రీడాకారిణి యమగూచిపై జరిగిన మ్యాచ్‌లో విక్టరీ సాధించింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ తొలి సెట్‌లో 21-13 తేడాతో గెలిచిని సింధు ప్రత్యర్ధికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆడింది. మ్యాచ్‌ ప్రారంభంలో కొద్దిగా తడబడిన సింధు ఆ తర్వాత బలంగా పుంజుకుంది. తొలి బ్రేక్‌లోనే 11-7తో ఆధిపత్యం ప్రదర్శించింది. అనంతరం రెండో సెట్ ఇద్దరి మధ్యా హోరాహోరీగా సాగింది. ఈ సెట్‌లో 22-20 తేడాతో విజయ దుంధిభి మోగించింది. దీంతో పీవీ సింధు సెమీస్‌కు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories