Team India: టీమిండియాలో కరోనా కలకలం.. చాహల్, గౌతమ్‌ కు పాజిటివ్‌

* టీమిండియాలో కరోనా కలకలం * పాజిటివ్‌ రావడంతో కొద్ది రోజులు శ్రీలంకలోనే చాహల్, గౌతమ్‌

Sandeep Reddy
Published on: 30 July 2021 2:10 PM IST
Team India Players Chahal And Gowtham Tested Corona Positive And Went to Isolation in Sri Lanka
X

స్పిన్నర్స్‌ చాహల్‌, కె.గౌతమ్‌ (ఫైల్ ఫోటో)

Team India: వన్డే మరియు టీ 20 సిరీస్ లో భాగంగా శ్రీలంక పర్యటనకి వెళ్లిన టీమిండియాలో మళ్లీ కరోనా కలకలం రేపింది. జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారినపడ్డారు. ఇటీవలే కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా తాజాగా స్పిన్నర్స్‌ చాహల్‌, కృష్ణప్ప గౌతమ్‌కు కరోనా సోకింది. పాండ్యాకు సన్నిహితంగా ఉన్న ఈ ఇద్దరికి కరోనా సోకడంతో మరికొంత కాలం గౌతమ్, చాహల్‌ లంకలోనే ఉండనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story