Shahid Afridi claims Indian Team: భారత్ పై ఆఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు!

Shahid Afridi claims Indian Team: భారత్ పై ఆఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు!
x
Highlights

Shahid Afridi claims Indian Team: భారత క్రికెట్ జట్టు పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది.. తాజాగా క్రిక్‌కాస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఈ మాజీ దిగ్గజం

Shahid Afridi claims Indian Team: భారత క్రికెట్ జట్టు పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది.. తాజాగా క్రిక్‌కాస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఈ మాజీ దిగ్గజం.. తన క్రికెట్ కెరీయర్లో భారత్, ఆసీస్ జట్ల పైన ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడేవాడినని చెప్పుకొచ్చాడు. ఆ రెండు ఉత్తమమైన జట్లు కావడంతో ఒత్తిడి ఉండేదని, ఆయా దేశాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్లో ఆడటమనేది చాలా పెద్ద విషయం అని అన్నాడు. ఇక భారత జట్టును చాలా సార్లు చాలా తేలికగా ఓడిచామని, ఆ తర్వాత వాళ్లొచ్చి మమ్మల్ని క్షమాపణలు కోరేవారని ఆఫ్రిది చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా భారత జట్టు పైన అత్యుత్తమమైన ప్రదర్శనని గుర్తు చేసుకుంటూ...1999లో చెన్నై టెస్టులో శతకం సాదించినట్లుగా తెలిపాడు.. . ఆ మ్యాచ్‌లో 42/2తో ఉన్న జట్టును ఆఫ్రిది 141 పరుగులు చేసి అందుకున్నాడు. ఇదే భారత్ పైన తన అత్యుత్తమమైన ఇన్నింగ్స్ అని అన్నాడు. ఇక ఆఫ్రిది తన కెరీర్‌లో మొత్తం 398 వన్డేలు, 27 టెస్టులు, 99 టీ20లు ఆడాడు..ఇక 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌లో కొనసాగుతున్నాడు.

తన ఆరోగ్యంపై వివరణ :

గతంలో ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు.. కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు. కరోనా నుంచి మెల్లిమెల్లిగా కొలుకుంటున్నప్పటికి తన ఆరోగ్యానికి సంబంధించిన ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుండడంతో తాజాగా ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోలో క్లారిటీ ఇచ్చాడు ఆఫ్రిది.. తాను క్రమంగా కోలుకుంటున్నానని నా గురించి భయపడాల్సిన అవసరం లేదంటూ.. ఈ మహమ్మారిపై మీకు మీరుగా పోరాడకపోతే దాన్ని జయించలేరు అంటూ చెప్పుకొచ్చాడు ఆఫ్రిది..


Show Full Article
Print Article
Next Story
More Stories