IPL 2020: జోడీ నంబర్‌ వన్‌.. కోహ్లీ-ఏబీడీ

IPL 2020: జోడీ నంబర్‌ వన్‌..  కోహ్లీ-ఏబీడీ
x

IPL 2020: జోడీ నంబర్‌ వన్‌.. కోహ్లీ-ఏబీడీ

Highlights

IPL 2020: బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మిస్ట‌ర్ 360. ఏబీ డివిలియర్స్ ల జోడీ‌ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లీగ్‌లో అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న తో ఆల్‌టైమ్ నంబర్‌ వన్‌ జోడీగా నిలిచారు

IPL 2020: బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మిస్ట‌ర్ 360. ఏబీ డివిలియర్స్ ల జోడీ‌ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లీగ్‌లో అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న తో ఆల్‌టైమ్ నంబర్‌ వన్‌ జోడీగా నిలిచారు. గతరాత్రి షార్జా వేదికగా కోల్‌కతాతో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ, ఎబి డివిలియర్స్ లు కొత్త మైలురాయి దాటారు. వీరిద్ద‌రూ జోడీ ఐపిఎల్ చరిత్రలో 10 సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్న మొదటి జోడీగా నిలిచారు.

షార్జా వేదికగా జ‌రిగిన‌ కోల్‌కతాతో తలపడిన సందర్భంగా కోహ్లీసేన 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డివిలియ‌ర్స్ 33 బంతుల్లో 73 ప‌రుగులు( 5x4, 6x6), విరాట్‌ కోహ్లీ 28 బంతుల్లో ఒక ఫోర్‌తో 33 ప‌రుగులు తో చేల‌రేగారు. వీరిద్ద‌రూ కేవ‌లం 46 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. దీంతో ఈ టోర్నీలో 10 సెంచ‌రీల భాగ‌స్వామ్యాన్ని నిర్మించిన ఆట‌గాళ్లుగా రికార్డులకెక్కారు. అలాగే వీరిద్దరూ కలిసి 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

విరాట్ కోహ్లీ మరియు క్రిస్ గేల్ కాంబినేషన్ 9 శతకాలు సాధించి రెండో స్థానంలో ఉంది. దీని తరువాత 6 శతాబ్దాల భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. జానీ బెయిర్‌స్టో మరియు డేవిడ్ వార్నర్‌లకు ఐదు సెంచరీ పార్టనర్ షిప్ ఉంది. గౌతమ్ గంభీర్ మరియు రాబిన్ ఉతప్ప కూడా 5 సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

మరోవైపు డివిలియర్స్‌ ఈ టోర్నీలో ఆరుసార్లు.. 23 లేదా అంతకన్నా తక్కువ బంతుల్లో అర్ధశతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ముంబయి ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఏబీడీ దంచి కొట్టడంతో పొలార్డ్‌తో సమానంగా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories