T20 World Cup: ఒకే గ్రూపులో భారత్-పాక్ జట్లు

ICC T20 World Cup: India, Pakistan in Same Group
x

T20 World Cup: ఒకే గ్రూపులో భారత్-పాక్ జట్లు

Highlights

T20 World Cup: భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ కిక్కిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది.

T20 World Cup: భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ కిక్కిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. టీ-20 వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో చేర్చడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ చూద్దాం.

ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ గ్రూప్స్‌ను ఐసీసీ ప్రకటించింది. టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించిన ఐసీసీ భారత్, పాకిస్తాన్‌లో ఒకే గ్రూపులో చేర్చింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూపుల్లో వాటికి చోటు కల్పించారు. టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో సాగనుంది.

మరోవైపు ర్యాంకుల్లో టాప్-8 జట్లు నేరుగా రెండో రౌండ్‌లో ఆడనున్నాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో ఐసీసీ చేర్చింది. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లీస్ట్‌లో ఉన్న జట్లను, అర్హత పోటీల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా ఐసీసీ విభజించింది. ఇవి తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడి, ఆపై సూపర్-12కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న టీమ్ లు కూడా సెకండ్ రౌండ్ ఆడనున్నాయి.

ఇక ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ అద్దిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ జట్లను ఒకే గ్రూపులో చేర్చడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరోవైపు భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా వ్యాప్తి కారణంగా యూఏఈ తరలిపోయింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. త్వరలోనే టోర్నమెంట్ మ్యాచ్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories