Tokyo Olympics 2021: పతకానికి అడుగు దూరంలో బాక్సర్ పూజారాణి

Tokyo Olympics 2021: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన బాక్సర్ పూజారాణి * ఆల్జీరియా బాక్సర్‌ చైబ్‌పై 5-0తేడాతో విజయం

Sandeep Eggoju
Updated on: 28 July 2021 5:48 PM IST
Boxer Pooja Rani Reached to Quarter Final in Tokyo Olympics 2021
X
క్వాటర్ ఫైనల్ కు చేరిన బాక్సర్ పూజ రాణి (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics 2021 - Boxer Pooja Rani: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఒలింపిక్స్ 69-74 కేజీల విభాగంలో ఇండియ‌న్ బాక్సర్ పూజా రాణి క్వార్టర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16 బౌట్‌లో పూజా రాణి అల్జీరియా బాక్సర్ చైబ్‌పై 5-0 తేడాతో గెలిచింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జ‌డ్జ్‌లు పూజానే ఏక‌గ్రీవంగా విజేత‌గా తేల్చడం విశేషం. త‌న ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌ల‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన పూజా రాణి మ‌రో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా భారత్‌కు ప‌త‌కం ఖాయ‌మ‌వుతుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story