బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య సీడ్నీవేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఐదో...
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య సీడ్నీవేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఐదో రోజు ఆటలో టీమిండియా భోజన విరామ సమయానికి 76 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 98/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్ లో వైడ్ చేతికి దొరికిపోయాడు. భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లు ధాటిగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో పంత్ (73,97బంతుల్లో,8X4,3x6) ఆర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్ లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్ లో పుజారా(41,147 బంతుల్లో, 5ఫోర్లు) పూర్తి డిఫెన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి 104 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే 201 పరుగులు అవసరం. భారత్ బ్యాటింగ్ సరళి చూస్తే డ్రా వైపై మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది.
5️⃣0️⃣
— BCCI (@BCCI) January 11, 2021
Batting at No. 5 today, Rishabh Pant brings up his half-century in just 64 balls. What a fine knock this has been. 👏🏾😎 #TeamIndia #AUSvIND
Details - https://t.co/lHRi0PWEbs pic.twitter.com/0qyu3UZBXh
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire