తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ : 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ : 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం
x
Highlights

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ సోమవారం, స్వామివారి మూలవిరాట్టును నిత్యసేవలు అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపంలో విశేషపూజ అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ సోమవారం, స్వామివారి మూలవిరాట్టును నిత్యసేవలు అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపంలో విశేషపూజ అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

ఇక రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 3 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 1 గంట, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు గంటన్నర సమయంలో స్వామివారి దర్శనభాగ్యం పొందుతున్నారు.

నిన్నటి రోజు అదివారం 83,343 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.15 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 31,446 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories