తిరుమలలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ
x
Highlights

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది .... ఇవాళ అదివారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలేవి ఉండవు..రద్దీ కారణంగా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 18 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతొంది.

నిన్నటి రోజు శనివారం 85,662 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.51 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 37,998 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories