చెన్నకేశవస్వామి ఆలయ రహస్యాలు

చెన్నకేశవస్వామి ఆలయ రహస్యాలు
x
Chennakeshava Temple
Highlights

ప్రకృతీ అందాల నడుమ నదీ పరవల్ల సమీపంలో వెలిసాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. కొలిచిన వారి కొంగుబంగారమై, భక్తుల కోరికలను తీరుస్తాడు చెన్నకేశవుడు. ఈ ఆలయం గుంటూరు జిల్లాలోని మాచెర్లలో కొలువై ఉన్న దేవాలయం.

ప్రకృతీ అందాల నడుమ నదీ పరవల్ల సమీపంలో వెలిసాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. కొలిచిన వారి కొంగుబంగారమై, భక్తుల కోరికలను తీరుస్తాడు చెన్నకేశవుడు. ఈ ఆలయం గుంటూరు జిల్లాలోని మాచెర్లలో కొలువై ఉన్న దేవాలయం. ఇది పట్టణంలో గల చంద్రవంకనది ఒడ్డున ఉంది.

ఆలయ విశేషాలు: శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం ఆలయంలో ప్రధాన దేవతా మూర్తులు చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు. ఇది సుమారు 13 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయ ప్రధాన ద్వారం వద్ద ధ్వజస్తంభం దీనిపై స్వామి విగ్రహం చెక్క, కంచుతో చేయబడి ఉంది. దేవాలయ గాలిగోపురం ముందు ధ్వజస్తంభం ప్రక్కన బ్రహ్మొత్సవాల సమయం స్వామి వారి కళ్యాణానికి వినియోగించే కళ్యాణమండపం ఉంది. ప్రధాన దేవాలయం ముందు బలిపీఠం ఉంది. దీనిపక్కన దక్షణంలో కప్పక స్తంభం, ఉత్తరంన గిలకల బావి ఉన్నాయి. గర్భగుడి ముందు రంగ మండపంలో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి. వాటి పై శ్రీ మధ్బాగవతము, శ్రీమన్నారాయణ అవతారము, శ్రీ మహాభారతం, మరియు శ్రీమద్ రామాయణం గాథలను చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయం క్రీ.శ 1113 లో శైవ దేవాలయంగ అనిర్మించబడింది. ఈ దేవాలయం బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవ దేవాలయంగా మార్చబడింది. దీనికి ప్రధాన కారణం అనేక మంది హిందువులు వైష్ణవ, శైవ మతములను విడిచి పెట్టి బౌద్ధ మతంలో చేరుతుండేవారు. ఈ సమయంలో ఆదిశంకరాచార్యులు అద్వైత మతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం దేవుడు ఒక్కడే, దేవుడు నీలోనే ఉన్నాడు అనే భావన కల్గింది. ఈ భావనలతో హిందూ మతం నుండి బౌద్ధమతానికి వెళ్ళిపోయిన వారు తిరిగి హిందూ మతంలోనికి చేరారు.

రంగమండపం:

చోళరాజుల నాటి శిల్పకళ దేవాలయం మండల స్తంభాలపై దర్శనమిస్తుంది. రంగ మండపంలోని నాలుగు స్తంభాలపై భారత, భాగవత, రామాయణ గాథలు మనోహరంగా చెక్కి ఉన్నాయి. ఇక్కడి శిల్పశైలి హనుమకొండలోని వేయి స్తంభాలగుడి శిల్పకళను పోలి ఉంటుంది. గర్భాలయం, అంతరాళాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి పది స్తంభాలతో ప్రదక్షిణా పథం ఏర్పరిచారు. పదహారు స్తంభాలతో గర్భాలయాన్ని అప్పటి శిల్పులు మనోహరంగామలిచారు. గర్భగుడి ముందు ఉన్న రంగ మండపంలో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి. వాటి పై శ్రీ మధ్బాగవతము, శ్రీమన్నారాయణ అవతారము, శ్రీ మహాభారతం, మరియు శ్రీమద్ రామాయణం గాథలను అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఇవి నాటి శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. మహాభారతం ఘట్టాలైనా కర్ణ, అర్జునుల యుద్ధం, పాచికలాట, అశ్వమేధయాగం, గదాయుద్ధం అత్యంత రమణీయంగా ఉంటాయి. రామాయణం లోని రసవత్త ఘట్టాలైన మాయ లేడిని వేటాడటం, వాలీ సుగ్రీవుల యుద్ధం, రామ రావణ యుద్ధం, కైలాసగిరిని ఎత్తటం వంటి శిల్పాలు చూపరులను కనువిందు చేస్తాయి.శ్రీ మధ్బాగవతము ఘట్టాలైన గణపతి గజాసురడి యద్ధం, త్రిపుర సంహారం, సాగర మథనం, దేవతా కూటమి, ఏనుగుల అభిషేకాలు వంటి శిల్పాలు అందరిని ఆచ్చర్యచకితులని చేస్తాయి. శ్రీమన్నారాయణ ఘట్టాలైన గోవర్థనగిరి, దశావతారాలు అత్యంత సుందర మనోహరంగా దర్శన మిస్తాయి. ఈ శిల్పకళా నైపుణ్యం చోళ శిల్పకళను పోలివుంటుంది. వీటిని చోళ శిల్పములు అనికూడా అంటారు.

బలిపీఠం:

దేవాలయ ముందు ఉన్న ద్వజస్తం ముందుబాగాన ఈ బలిపీఠం ఉంది. దీని ఎత్తు నాలుగు అడుగులు. ఈ పీఠంలో చెన్నకేశవ స్వామి ఉంటాడని భక్తుల నమ్మకం. ఈ పీఠం నుండే శ్రీ చెన్నకేశవస్వామి ఐతాంబకు దర్శనమిచ్చినాడట. బ్రహ్మొత్సవాల సమయంలో బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ధ్వజ స్థంభం: త్రిపురాంతకపురానికి చెందిన పాలుట్ల తిరుపతయ్య కుమారుడు ఓబన్న గుడి ముందు బయట ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు.

కప్పక స్థంభం: గుడి బయట గరుడ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించు సమయంలో దాని పై భాగం కొంత విరిగింది. ఆ విరిగిన భాగమును దేవాలయ ఆవరణ లోపన ధ్వజస్తంభం పక్కన ప్రతిష్ఠించారు. దీనిని కప్పక స్తంభంగా పిలుస్తారు. దీని చుట్టూ ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల విశ్వసం.

చారిత్రక ప్రసిద్ధి:

ఈ దేవాలయం చారిత్రక ప్రసిద్ధి చెందినది. దేవాలయం వద్ద లభించిన శాసనాల ప్రకారం హైహవ వంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయంలో చెన్నకేశవ స్వామిని త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెప్పుచున్నది. ఈ ప్రాంతంలో చంద్రవంక నది తన గమనదిశను అమార్చుకుని ఉత్తర వాహిని అయ్యింది. అందువల్ల ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది.శ్రీనాధుని పల్నాటి చరిత్ర ఇక్కడి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. శ్రీనాధుడు పల్నాటి వీరచరిత్రను ఈ ఆలయం నుండే రచించడం ప్రారంభించాడట. ఈ ఆలయంలో మంటప స్తంభాలు చోళరాజుల కాలంనాటి శిల్పకళాశోభకు సాక్ష్యాలు.

బ్రహ్మొత్సవాలు:

స్వామివారి బ్రహ్మొత్సవాలులలో మొదటి రోజు నుండి వరుసగా అంకురార్పణ, ధ్వజారోహణం, కళ్యాణోత్సవం, హనుమద్వాహనం, శేషవాహనం, గరుడవాహనం, రవిపొన్న వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, శుకవాహనం, పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలు, ఏకాదశ కలశస్థాపన, పవళింపుసేవ యిలా 15 రోజులపాటు జరిగిన తరువాత 16 వ రోజు బ్రహ్మొత్సవాలు ముగుస్తాయి.

రథోత్సవం:

రాష్ట్రంలోనే పెద్దది (ఎత్తు) కలిగినదిగా చెన్నకేశవస్వామి రథం పేరెన్నెకకలది. బ్రహ్మొత్సవాలలో భాగంలో జరుగు రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. క్రీ.శ.1880కు ముందు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామికి కళ్యణం ఐదు రోజులు మాత్రమే నిర్వహించి తెప్పోత్సవం జరిపేవారు. బ్రహ్మోత్సవ ఘట్టాలలో రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 128 ఏళ్లుగా ఇది ఎంతో ఆడంబరంగా జరుగుతోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద రథంగా చెన్నుని రథం పేరొందింది. 1879లో దుర్గి వాస్తవ్యుడు కుచనపల్లి నారాయణ పంతులు 60 అడుగుల ఎత్తు, ఆరు అంతస్తులతో రూ. 10 వేలు వెచ్చించి చెన్నకేశవ రథం రూపొందించారు. 1880 ఏప్రిల్‌ 29న ప్రథమ రథోత్సవం నిర్వహించారు. క్రీ.శ.1880లో రథం నిర్మాణం అయిన తరువాత అప్పటి నుంచి రథోత్సవం నిర్వహిస్తున్నారు. దీంతో తెప్పోత్సవం మరుగున పడింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుండి స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా చైత్రబహుళ పూర్ణిమనాడు కళ్యాణం, ఆ తరువాత ఐదవ రోజు చైత్రబహుళ పంచమి నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం తిలకించటానికి రాష్ట్ర నలుమూలలు నుంచి భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో మాచెర్లకు వస్తారు.

రథ నిర్మాణము:

క్రీ.శ. 1879లో స్థానికి గోల్కొండ వ్యాపారలు కంచనపల్లి నారాయణరావు 60 అడుగుల ఎత్తు గల రథం నిర్మించి శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామికి కానుకగా క్రీ.శ 1880లో దేవాలయానికి అందించారు. నాటి నుంచి స్వామి వారి బ్రహ్మొత్సవాలలో భాగంగా రథొత్సవం నిర్వహిస్తున్నారు.

నాగశిలాస్థంభ శాసనం:

తెల్లని పాలరాతిపై నాగశిలాస్తంభ శాసనం శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవాలయం దక్షణంలో గిరేశ్వరాలయం ముందు నాలుగు వైపులా 94 వరసలతో చెక్కబడిన ఈ శాసనం నేటికి ఉంది. ఈ శాసనాన్ని శా.శ 1033 (క్రీ.శ 1111) మేడాంబిక కుమారుడు వారకాముడు పరిపాలన కాలంలో శ్రీధరుడు-భోగమాంబిక కుమారుడు ఆదిత్యడనునతను మహాదేవితటాక (మాచర్ల) యను పట్టణములో ఆధిత్యేశ్వరాలయం నిర్మింరినాడు. ఈ దేవాలయం నిర్మించిన తరువాత రెండు సంవత్సరములకు శా.శ 1035/క్రీ.శ 1113లో వేయించెను. ఆధిత్యుడు నర్మించిన దేవాలయమునకు 300 గ్రామము గల పల్నాడు రాజ్యమందు సచ్చేయపల్లి గ్రామములో 200 నిర్తనాల భూమిని సాగి బేతరాజు కానుకగా ఇచ్చాడు. దేవాలయం నర్మించిన శిల్పులు తిప్పోజు, పాతోజు, నారోజు లకు మహాతటాకానకి దక్షణమున 60 నివర్తనాల భూమిని దానంగా ఇచ్చారు. ఈ శాసనం ప్రకారం హైహయ సాగి మేత 1- మేడాంబిక వివాహం, వారి కుమారుడు వీరకాముని గురించి, అతని కుమారుడు సాగిబేత-2 గురించి తెలియను.

నాటి ఆధిత్యేశ్వరాలయంమే నేటి శ్రీ గిరీశ్వరాలయము:

శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవాలయానికి ప్రక్కనే దక్షణం వైపున ఆధిత్యేశ్వరాలయం లేక శ్రీ గిరీశ్వరాలయము ఉంది. క్రీ.శ. 1111లో హైహయ చాగి బేతరాజు కాలంలో శ్రీధరుని కుమారుడు ఆధిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించి, క్రీ.శ 1113లో ఆలయం ముందు భాగంలో నాగశిలస్తంభ శాసనం వేయించాడు. కొందరు పేర్కోన్నట్లుగా ఆధిత్యేశ్వరాలయాన్ని బ్రహ్మనాయుడు చెన్నకేశవాలయంగా మర్చలేదని శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామివారి దేవస్థానం, మాచర్ల. పుస్తకంలో రచయిత చిరతనగండ్ల సోమేశ్వరరావు పేర్కోన్నారు. ఇందుకు సాక్షంగ నాగశాసనమే అని తెలిపారు. ఆధిత్యేశ్వరాలయంమే కాలక్రమేనా గిరేశ్వరాలయంగా రూపాంతరం చెందినట్ల పుస్తకం పేర్కొన్నాడు. క్రీ.శ 1935 ఫిబ్రవరి 21 గురువారం కర్నాటి హనుంమంతరామయ్య అతిని సినతండ్రి హనుమయ్యలు దేవాలయం మండపాదులు శిథిలమై పోవుచుండగా మండపము, చప్టాలు ఊడదీయించి గిరేశ్వరుడు గర్భగుడి ఇరువైపులా భ్రమరాంబ, గణపతి గర్భాలయాలను కట్టించి య.13.50 సెంట్లు భూమిని స్వామివారికి నిత్యనైవేద్య దీపోత్సవములు జరుపుటకు మాన్యంగా సమర్చించారు. దీనికి సంబంధించి ఆలయం ముందు ఎర్రరాతిరాయి శాసనం వేయించాడు.

ఓటిగుడి:

పలనాడులో మలిదేవుల పాలనకు పూర్వం జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారట. మాచర్ల చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో మూలవిరాట్ లేకుండా ఒక శిథిల దేవాలయం ఉంది. ఇది ఎవరు కట్టించారో ఆధారం లేదు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగూళ్లుగా పిలుస్తారని, ప్రస్తుతం ఈ శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన 'పలనాటి చరిత్ర' పుస్తకంలో రాశారు. అలానే మాచర్ల పట్టణ శివారు లోని దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు. మరికొందరు ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామిగా చెపుతారు. ఈ దేవాలయ నిర్మాణసమయంలో పిడుగుపడి కూలిపోయిందంటారు. గుడి గోడల పై గొప్ప శిల్పకళ ఉంది. 12వ శతాబ్దం వరకు శ్రీశైలం నంచి గుంటూరు వరకు ఇచ్చట శైవ క్షేత్రాలే ఉన్నాయి. ఇక్కడ వైష్ణవాన్ని పరిచయం చేసినది బ్రహ్మనాయుడే. స్వయంగా బ్రహ్మనాయుడే తనను విష్ణు అంశగా చెప్పుకున్నాడు. రెండు వర్గాలు చెప్పిన కథ ప్రకారమే అలుగ రాజు మరణం బ్రహ్మనాయుడు విష్ణు అంశను ప్రదర్షించటంతో సింహాసనం లోని లోహపు ముక్క అలుగరాజు గుండెల్లో గుచ్చుకోవటంతో చనిపోయాడు. పలనాడులో తొలి విష్ణు రూపం "చెన్న కేశవుడే".


Show Full Article
Print Article
More On
Next Story
More Stories