Viral Video : నడిరోడ్డుపై యువకుడిపై ట్రాఫిక్ పోలీస్ దాడి.. వీడియో వైరల్

Viral Video : నడిరోడ్డుపై యువకుడిపై ట్రాఫిక్ పోలీస్ దాడి.. వీడియో వైరల్
x
Highlights

Traffic constable caught thrashing man near governor convoy: ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ మొదట నెట్టివేయడం ఆ వీడియోలో కనబడుతుంది. తరువాత అతన్ని నేలపై పడేయడం, తన్నడం, చెంపపై కొట్టడం చూడొచ్చు.

Viral Video : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో గవర్నర్ కాన్వాయ్ దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ మొదట నెట్టివేసినట్లు, తరువాత అతన్ని నేలపై పడవేసి, తన్నులు, పంచ్‌లతో కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత డీసీపీ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రజల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వైరల్ వీడియో శనివారం మధ్యాహ్నం నాటిదని చెబుతున్నారు. గవర్నర్ ఒక కార్యక్రమం కోసం రైసేన్ వైపు వెళ్తున్నారు. ఆయన కాన్వాయ్ నగరంలోని ఆనంద్ నగర్ కూడలికి చేరుకున్నప్పుడు, ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే ఒక ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తిని నేలకేసి తోసేశాడు. దీని తరువాత అతన్ని చెంపదెబ్బలు, తన్నులు, పంచ్‌లతో విరుచుకుపడ్డాడు.

వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటనపై దర్యాప్తునకు ట్రాఫిక్ డీసీపీ ఆదేశించారు. గుర్తుతెలియని వ్యక్తిని గుర్తించడంతో పాటు సంఘటన నిజాన్ని తెలుసుకునే బాధ్యత ఏసీపీ ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. దీనితో పాటు, సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

ఆ సంఘటన గురించి అధికారి ఏమన్నారంటే ?

గవర్నర్‌కు Z ప్లస్ భద్రత కల్పించామని అందువల్ల కాన్వాయ్ దగ్గరకు ఎవరినీ అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసు అదనపు డీసీపీ విక్రమ్ రఘువంశీ తెలిపారు. బారికేడింగ్ ఉన్నప్పుడు, కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు వాహనాల వేగం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి బారికేడ్ దగ్గరగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం విషయానికి సంబంధించి స్థానిక ప్రజలు, అక్కడ ఉన్న ఇతర వ్యక్తుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories